రెండు వారాల ముందే వచ్చేస్తాడంట

  • January 23, 2018 / 07:38 AM IST

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలు రెండూ ఒకేరోజు అనగా ఏప్రిల్ 27న విడుదలవుతున్నాయి అని సదరు చిత్రాల నిర్మాతలు, నిర్మాణ సంస్థలు మూకుమ్మడిగా ఎనౌన్స్ చేసేసరికి ఇరువర్గాల అభిమానుల నడుమ ఓ మినీ యుద్ధమే జరిగింది. పోనీ ఏ సంక్రాంతికో ఇద్దరూ పోటీ పడితే వేరే విధంగా ఉంటుంది కానీ వేసవి సెలవుల్లో ఇద్దరు స్టార్ హీరోలు అది కూడా ఒకేరోజున పోటీపడడం వారి స్టార్ డమ్ లను ప్రూవ్ చేసుకోవడం వరకూ పర్లేదు కానీ.. బిజినస్ పరంగా చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తోంది. అందువల్ల మహేష్ బాబు, అల్లు అర్జున్ లలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గడమో లేక సామరస్యంతో విడుదల తేదీలను మార్చుకోవడమే జరగాల్సిందేనని విశ్లేషకులు ఎప్పట్నుంచో చెబుతున్నారు.

అందరూ ముందే ఊహించినట్లుగా.. అల్లు అర్జున్ “నా పేరు సూర్య” విడుదల తేదీ మారింది. అయితే అల్లు అర్జున్ వెనక్కి వెళ్లలేదు. ఏకంగా రెండు వారాల ముందే వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 13కి “నా పేరు సూర్య” రిలీజ్ డేట్ మారిందని వినికిడి. చిత్రబృందం ఇవాళ సాయంత్రంలోపు ఇందుకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వనుంది. సో అల్లు అర్జున్ ఇప్పుడు తన సినిమాని రెండు వారాల ముందు పోస్ట్ పోన్ చేసుకోవడంతో మహేష్ బాబుకి కలిసొచ్చే అంశం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus