టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న బోణీ కపూర్

  • September 11, 2019 / 12:16 PM IST

“మజిలీ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య.. త్వరలోనే శేఖర్ కమ్ముల సినిమాలో తెలంగాణ కుర్రాడిగా కనిపించడం కోసం సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది. అయితే.. ఆ సినిమా తర్వాత నటించబోయే చిత్రాన్ని చైతూ సైన్ చేశాడని తెలుస్తోంది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “బాదాయ్ హో” తెలుగు రీమేక్ లో నాగచైతన్య నటించనున్నాడు. ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా తెరకెక్కిన ఆ చిత్రం అక్కడ 100 కోట్లకు పైన వసూలు చేసింది.

ఈ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్ కూడా తెలుగులో డెబ్యూ చేయనున్నాడు. ఈ సినిమాని దిల్ రాజుతో కలిసి బోణీ కపూర్ నిర్మించనున్నాడు. దర్శకుడు ఎవరు, ప్రధాన తారాగణం ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేనప్పటికీ.. ఈ రీమేక్ సినిమాలో నటించడం అనేది చైతన్యకి బాగా కలిసొచ్చే విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus