మళ్ళీ బాలయ్యను టార్గెట్ చేసిన నాగబాబు..!

  • January 4, 2019 / 11:49 AM IST

గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ పై ఏదో ఒక రకంగా సెటైర్లు వేస్తూ వస్తున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. మొదట్లో బాలయ్య ఎవరో నాకు తెలియదని సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు… తరువాత కమెడియన్ బాలకృష్ణ తనకు తెలుసంటూ… వివాదాస్పద కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇక అక్కడితో ఆగకుండా … బాలయ్య చెప్పే మా జాతి, మా రక్తం డైలాగులను టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ఈసారి తన ఫేస్ బుక్ పేజీలో ఓ కవిత పోస్ట్ చేశాడు. ఈ కవిత ద్వారా బాలయ్య నటించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ పై విమర్శలు కురిపించినట్టు స్పష్టమవుతుంది.

ట్టు కథలు కొన్ని..
కల్పనలు ఇంకొన్ని..
చుట్టనేల.. మూటకట్టనేల
నిజం కక్కలేని బయోపిక్కులొద్దయ్యా
విశ్వదాభి రామ
వినరా మామ..


(కవిత్వాలు మాకూ వచ్చండోయ్) అంటూ… నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ నాగబాబు చేస్తోన్న వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.ఈ పోస్ట్ లో ‘స్టే ట్యూన్డ్’ అని వ్యాఖ్యానించడం ద్వారా, ఇక పై తన సోషల్ మీడియా పేజీ నుండీ ఇలాంటి సెటైర్లు వరుసగా ఉంటాయనే హింట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. కట్టు కథలు, కల్పనలు, నిజం కక్కలేని ఈ బయోపిక్కులు మాకొద్దంటూ నాగబాబు పెట్టిన ఈ పోస్ట్ పై సోషల్ మీడియాలో కొందరు బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. ఏదైతేనేం.. నాగబాబు సెటైరికల్ కవిత మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంకా బాలయ్య ను ఎన్ని విధాలుగా టార్గెట్ చేస్తాడో చూడాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus