ధనుష్ వల్ల నాగ్ కు టైం వేస్ట్…?

  • January 2, 2019 / 09:23 AM IST

కింగ్ నాగార్జున ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాల పై దృష్టి పెడుతున్నట్టు స్పష్టమవుతుంది. 2018 లో నేచురల్ స్టార్ నాని తో కలిసి ‘దేవదాస్’ మూవీ చేసాడు నాగ్. ఈ చిత్రానికి మంచి రివ్యూలు, డీసెంట్ కలెక్షన్లు వచ్చినప్పటికీ… పంపిణీదారులు ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవడంతో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఇక ఈ చిత్రంలో నాగ్ స్టైలిష్ డాన్ పాత్రలో వందశాతం అలరించాడనే చెప్పాలి. ‘దేవదాస్’ చిత్రం తరువాత బాలీవుడ్ లో ‘బ్రహ్మాస్త్ర’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు నాగ్. దీనితో పాటూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ అల్లుడు అయిన ధనుష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నాగార్జున నటించబోతున్నట్టు ప్రచారం జరిగింది.

ఈ విషయాన్ని నాగ్ కూడా కన్ ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ధనుష్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఆ ఈ చిత్రం స్టార్ట్ అవ్వకపోవడం గమనార్హం. ధనుష్ హీరోగా మాత్రం సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవల ధనుష్ హీరోగా నటించిన ‘మారీ 2’ కూడా విడుదలైంది. ఇక ఈ చిత్రం తరువాత ధనుష్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే మల్టీ‌స్టారర్ మొదలవుతుందని అంతా అనుకున్నారు. దీనికి నాగార్జున కూడా చెన్నై చేరుకుని షూటింగ్‌లో పాల్గొంటారని అంతా భావించినప్పటికీ.. అలాంటిదేమీ జరుగక పోవడం గమనార్హం. పైగా ధనుష్ హీరోగా ‘అసురన్’ కూడా అనౌన్స్ చేసేసాడు. తొందరలోనే రెగ్యులర్ షూట్ కూడా మొదలు పెట్టబోతున్నారట. ఈ నేపథ్యంలో ఇక మరి మల్టీస్టారర్ మొదలయ్యే సంగతులు కనబడటం లేదని ఫిలింనగర్లో చెప్పుకొస్తున్నారు. ‘తేనాండల్ మూవీస్’ నిర్మాణ సంస్థ వారి ఆర్దిక సమస్యల వల్లే ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్ళలేదని వారు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే.. ధనుష్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన నాగార్జున డేట్స్ వేస్టయ్యాయనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus