మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న “ఓం నమో వేంకటేశాయ”

  • July 19, 2016 / 06:26 AM IST

ఏడుకొండల స్వామిని ఆరాధించి ప్రియా భక్తుడిగా చరిత్రలో కెక్కిన హథీ రామ్ బాబాగా కింగ్ నాగార్జున నటిస్తున్న చిత్రం “ఓం నమో వేంకటేశాయ”. అన్నమయ్య, శ్రీ రామ దాసు, షిరిడి సాయి సినిమాల తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తున్న భక్తిరస చిత్రం ఇది. ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన తిరుమల సెట్ లో ఈ నెల రెండు నుంచి మొదలైన సంగతి తెలిసిందే.

యూనిట్ సభ్యులందరూ సంప్రదాయ దుస్తులు ధరించి.. నిలువు బొట్లు పెట్టుకుని చెప్పులు లేకుండా చిత్రికరణలో పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్దలతో తీస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ నేటి (సోమవారం)తో విజయవంతంగా  పూర్తి అయింది. ఈ విషయాన్ని దర్శకేంద్రుడు స్వయంగా సోషల్ మీడియా వేదికపై వెల్లడించారు. 16 రోజుల పాటు సాగిన ఈ షూటింగ్ లో బాబాకు తిరుమలేశునికి మధ్య జరిగిన సన్నివేశాలతో పాటు, సన్యాసి వేషధారి అయినా అనుష్కపై కొన్ని సీన్లు చిత్రీకరించారు. గత శనివారం విడుదల చేసిన ఈ సినిమా వీడియో లోగోకు మంచి స్పందన వచ్చింది. లోగో డిజైన్ కు యం.యం. కీరవాణి నేపథ్య సంగీత తోడై మంచి అనుభూతిని ఇచ్చిందని నాగ్ అభిమానులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus