బాలీవుడ్ బ్యూటీను అగ్ర కథానాయికను చేసేందుకు

  • May 5, 2018 / 07:43 AM IST

“ఆడదానికి ఆడదే శత్రువు” అనే సామెత నిజమే అవ్వొచ్చు కానీ.. చాలాసార్లు అది అబద్ధమని తేలింది. ఈమధ్యకాలంలో మన హీరోలకంటే ఎక్కువగా హీరోయిన్లే కలిసిమెలిసి ఉంటున్నారు. అందుకు మన క్రేజీ హీరోయిన్లు కాజల్, రకుల్ లు నిదర్శనం. అయితే.. ఇప్పుడు ఒక సీనియర్ హీరోయిన్ కొత్తగా తెలుగు తెరకు పరిచయమైన మరో హీరోయిన్ కు సపోర్ట్ ఇస్తూ ఆల్మోస్ట్ ఆమెకు గాడ్ మదర్ లా నిలిచింది మహేష్ సతీమణి, మాజీ హీరోయిన్ నమ్రతా శిరోధ్కర్.

“భరత్ అనే నేను” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కైరా అద్వానీ నటిగానే కాక అందం విషయంలోనూ మంచి మార్కులు సంపాదించుకొంది. ప్రస్తుతం కైరా “బోయపాటి-చరణ్” కాంబినేషన్ ఫిలిమ్ లో యాక్ట్ చేస్తుంది. ఈ సినిమా అనంతరం ఆమెకు వరుసబెట్టి అగ్ర కథానాయకుల సరసన సినిమాల్లో నటించేలా నమ్రత జాగ్రత్తలు తీసుకొంటుందట. అలాగే.. తన మరియు తన భర్త సర్కిల్ లో ఉన్న హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ కైరాను ప్రత్యేకంగా పరిచయం చేయడమే కాక రిఫర్ కూడా చేస్తుందట నమ్రత. చూస్తుంటే.. కైరాను అగ్ర కథానాయికగా తీర్చిదిద్దేంతవరకూ నమ్రత ఉరుకునేలా లేదు. అలాగే.. కైరా అద్వానీ నెక్స్ట్ అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీయార్ చిత్రాల్లోనూ కథానాయికగా నటించనుందని వినికిడి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus