మహేష్ అభిమానులకు థాంక్స్ చెప్పిన నమ్రత.!

  • March 23, 2018 / 09:55 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా సిగ్గు. చాలా తక్కువగా మాట్లాడుతారు. ఇప్పుడిప్పుడే టీవీ షోలకు వస్తున్నారు. మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అభిమానులతో కలిసి మాట్లాడుతున్నారు. ఈ మార్పు వెనుక కారణం అతని భార్య నమ్రతా శిరోద్కర్. సోషల్ మీడియాలో తాను యాక్టివ్ గా ఉంటూ మహేష్ ని కూడా అభిమానులతో టచ్ లో ఉండేలా చేస్తున్నారు. మహేష్ గురించి, పిల్లలు గౌతమ్, సితార గురించి నమ్రత ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారు. ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

తాజాగా మహేశ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్ బాబు తన షూటింగ్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా అభిమానులు ఆనందంతో అరుస్తూ తమ అభిమాన నటుడ్ని మొబైల్ కెమేరాల్లో బంధించేందుకు ప్రయత్నిస్తున్న వీడియోని ఆమె పోస్ట్ చేశారు. బహుశా, వారి అభిమానానికి సంతోషపడి ఆమె వీడియోని షేర్ చేశారు. అంతేకాదు మహేష్ పై ఇంతలా అభిమానం చూపిస్తున్న వారికీ కృతజ్ఞతలు కూడా తెలిపారు. నమ్రత మహేష్ ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పడంతో అందరూ సంతోషపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus