సెప్టెంబర్ లో నందమూరి అభిమానులకు వరుస పండుగలు

  • April 28, 2017 / 06:48 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. పూరి, బాలయ్య చిత్రం మొదలు పెట్టినప్పుడే సెప్టెంబర్ 29 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తేదీలో మార్పు ఉండకూడదని ఎండలను సైతం లెక్క చేయకుండా బాలకృష్ణ శ్రమిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జోరు మీద ఉన్నారు. జనతా గ్యారేజ్ తర్వాత  బాబీ దర్శకత్వంలోనటిస్తున్న జై లవ కుశ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.

నిన్నటితో రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 55 కోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలని తారక్ అనుకుంటున్నారు. కాబట్టి నందమూరి అభిమానులకు సెప్టెంబర్ నెల మొదటి రోజు నుంచే పండుగ మొదలవుతుంది. ఈ హడావుడి తగ్గుతుందనుకునే లోపున బాలయ్య  సెప్టెంబర్ 29 న వచ్చేస్తారు. ఇలా బాబాయ్, అబ్బాయ్ లు సెప్టెంబర్ లో తమ సినిమాలతో ఫ్యాన్స్ కి కనువిందు చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus