అవసరాల కోసం కిషోర్ తిరుమలను పక్కన పెట్టిన నాని ?

  • February 24, 2018 / 10:05 AM IST

అవసరాల శ్రీనివాస్, నానిల కెరీర్ దాదాపు ఒకేసారి మొదలయింది. ఇద్దరిమధ్య స్నేహం బలపడుతూ వచ్చింది. అవసరాల నటుడిగా, దర్శకుడిగా దూసుకువెళ్తుంటే.. నాని నటుడిగా, నిర్మాతగా విజయాలు అందుకుంటున్నారు. నానిని డైరక్ట్ చేయాలనీ అవసరాల ఎప్పటి నుంచో అటుకుంటున్నారు. కానీ ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్స్ లలో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఈ సారి శ్రీనివాస్ గట్టిగా పట్టుబట్టడంతో.. ఒక ప్రాజక్ట్ ని క్యాన్సిల్ చేసుకొని మరీ నాని డేట్స్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాని యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో “కృష్ణార్జున యుద్ధం” సినిమా చేస్తున్నారు.

నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటించడానికి నాని ఇదివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా నిర్మించడానికి రెడీగా ఉన్నారు. ఈ సినిమాకు చిత్రలహరి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మార్చిలో ఇది సెట్స్ మీదకు వెళ్లనుంది. కానీ ఆ చిత్రాన్ని చేయనని నాని స్పష్టం చేసినట్లు టాక్. కిషోర్ ఈ కథలో సాయి ధరమ్ తేజ్ ని హీరోగా నటింపచేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆ మూవీకి కేటాయించిన డేట్స్ ని అవసరాల శ్రీనివాస్ కి నాని ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ష‌న్‌లోను నాని నటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus