కింగ్ కు మోదీ ట్వీట్… ఎందుకు చేసినట్టు…?

  • March 14, 2019 / 11:33 AM IST

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు 2’ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2002 లో వచ్చిన నాగార్జున ఆల్ టైం హిట్ ‘మన్మధుడు’ కి సీక్వెల్ కావడం విశేషం. ఇదిలా ఉండగా… తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాగ్ కి ఓ ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మోదీ ఈ ట్వీట్ కేవలం నాగార్జునకు మాత్రమే కాదు.. సినీ-రాజకీయ ప్రముఖులందరికీ… పారిశ్రామిక వేత్తలకు చేసారని స్పష్టమవుతుంది.

ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందీ అంటే.. ”కొన్నేళ్ళుగా ఎన్నో చిత్రాల్లో నటించి లక్షలాది మంది అభిమానం పొందారు. అవార్డులు సొంతం చేసుకున్నారు. అత్యధికంగా అభిమానుల ఫాలోయింగ్ ను సంపాదించుకున్న మీరు.. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని కోరుతున్నాను” అంటూ మోదీ తన ట్వీట్ లో నాగార్జునను అలాగే మోహన్ లాల్ ను ప్రత్యేకంగా ట్యాగ్ చేసారు. ఈ తరహాలో ట్వీట్ రిక్వెస్ట్ ని అనుష్క, రణవీర్, దీపిక వంటి స్టార్ లను మోదీ జతచేయడం విశేషం. మరి దీనికి మన కింగ్ నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus