నయనతారతో రెండోసారి రొమాన్స్ చేయనున్న జయం రవి..?

  • May 5, 2016 / 11:23 AM IST

తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరో గా తెరకెక్కుతున్న బాబు బంగారం చిత్రంలో.. వెంకీ సరసన నటిస్తున్న నయనతార, ప్రస్తుతం పలు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది. ఇంత బిజీలోనూ ఓ చిత్రంలో నటించడానికి ‘వెట్టై మన్నన్’ ఫేమ్ నెల్సన్ ఆమెను ఒప్పించాడట.

ఈ చిత్రంలో నయనతారతో జయం రవి మరోసారి రొమాన్స్ చేయనున్నాడు. కథ నచ్చడంతో పాటు, మరోసారి జయంరవి సరసన ఆమె నటించడానికి నయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. గతంలో వీరిద్దరు కలిసి నటించిన తనిఒరువన్ చిత్రం తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఈ చిత్రాన్ని సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus