ఉయ్యాలవాడతో జతకట్టనున్న నయనతార

  • July 12, 2017 / 11:15 AM IST

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు151వ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఆ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మెడకు వెళ్లబోతోంది. ఒక పక్క స్క్రిప్టు పనులు జరుగుతుండగా, మరో పక్క ఆ పాత్ర కోసం చిరు ప్రత్యేకంగా తనని తాను తీర్చిదిద్దుకొంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఆ చిత్రాన్ని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ‘ఉయ్యాలవాడ’ చిత్రబృందం లొకేషన్ సెలక్షన్ తో పాటు  హీరోయిన్ ఎంపికపై కూడా దృష్టిపెట్టింది.

అనుష్క, ఐశ్వర్య రాయ్, సోనాక్షి సిన్హా పేర్లను పరిశీలించిన సురేందర్ రెడ్డి చివరికి నయనతారను సెలక్ట్ చేసినట్లు తెలిసింది. టాలీవుడ్ లో సీనియర్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తో నటించిన ఈ బ్యూటీ చిరంజీవితో మిస్ అయింది. ఉయ్యాలవాడతో ఆలోటు భర్తీ చేసుకోనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతమందించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కమల్ కన్నన్ గ్రాఫిక్స్ అందించనున్నారు. టాప్ టెక్నీషియన్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus