అమెరికా పయనమైన శ్రీనువైట్ల.!

  • March 28, 2018 / 07:39 AM IST

“బ్రూస్ లీ, మిస్టర్” సినిమాల డిజాస్టర్ అనంతరం శ్రీనువైట్ల గ్యాప్ తీసుకొని మరీ సిద్ధం చేయించుకొన్న కథ “అమర్ అక్బర్ ఆంటోనీ”. రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరిపేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసుకొంది. అయితే.. చిత్రబృందానికి అమెరికా వెళ్లడానికి వీసాలు దొరకలేదని అందువల్ల షూటింగ్ డిలే అయ్యే అవకాశాలున్నాయని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వార్తలపై చిత్రబృందం కూడా స్పందించలేదు. అయితే.. నిన్న రాత్రి శ్రీనువైట్ల తన ఫేస్ బుక్ ఎకౌంట్లో “అమెరికా వెళుతున్నాను” అంటూ ఒక ఫోటో పోస్ట్ చేశాడు. దాంతో సదరు వార్తలన్నీ పటాపంచలైపోయాయి.

రవితేజ సరసన అను ఎమ్మాన్యుల్, కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ తనయుడు కూడా కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనువైట్ల-రవితేజల కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో శ్రీనువైట్ల మార్క్ కామెడీ పుష్కలంగా ఉండబోతోందని వినికిడి. మరి ఈ చిత్రంతో శ్రీనువైట్ల బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus