Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Advertisement

పబ్లిక్‌ ప్లేసుల్లో లేదంటే ఏదైనా ఈవెంట్లలో సెలబ్రిటీలు కనిపిస్తే జనాలు ఎగ్జైట్ అవ్వడం.. సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడటం కామన్. అయితే వీటికి సెలబ్రిటీలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అంచనా వేయడం కష్టం. కొందరు స్టార్స్ చాలా ఓపికగా ఫోటోలు ఇస్తారు.

Rajendra Prasad

ఇంకొందరు మాత్రం మూడ్ బాగోలేకో లేక మరేదైనా టెన్షన్లోనో జనాలని లెక్కచేయకుండా వెళ్లిపోతుంటారు. బాలయ్య వంటి స్టార్లు అయితే ఫ్యాన్స్ ని కొట్టడం కూడా చూశాం.సూర్య తండ్రి శివ కుమార్ అయితే సెల్ఫీ తీసుకున్న వ్యక్తి ఫోన్ ని నెట్టేయడం వంటి సందర్భాలు కూడా చూశాం.

ఈ లిస్టులోకి ఫ్రెష్ గా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) చేరారు. ఇటీవల ఓ వేడుకలో సెల్ఫీ అడిగిన ఓ యువకుడిపై ఆయన చిరాకు చూపించి పక్కకు నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహం రీసెంట్‌గా ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి పొలిటికల్ లీడర్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అందులో రాజేంద్ర ప్రసాద్‌ కూడా ఒకరు.

ఈ వేడుకలో రాజేంద్ర ప్రసాద్ ను చూసి.. ఎక్సైట్ అయిన ఓ యువకుడు సెల్ఫీ కోసం ఉత్సాహంగా ఆయన వద్దకి వెళ్లాడు. కానీ రాజేంద్రప్రసాద్ ఆ యువకుడిని పక్కకు నెట్టేసి.. మొహం చిట్లించుకుంటూ, చాలా కసురుకుంటూ వెళ్లిపోయాడు.ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజెన్లు రాజేంద్రప్రసాద్ ను తిట్టిపోస్తున్నారు. ‘సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే కుదరదని సున్నితంగా చెప్పాలి కానీ.. యువకుడిపై ఆ రేంజ్ ఫ్రస్ట్రేషన్ ఏంటి?

మానవత్వం.. కనీసం ఇంగితం లేదా?’ అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంకొంత మంది ఇలాంటి వాళ్ళకి కూడా ‘పద్మశ్రీ పురస్కారాలు అవసరమా?’ అంటూ విమర్శిస్తున్నారు.ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్.. ఇలాంటి వివాదాలతో తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు.మొన్నమధ్య డేవిడ్ వార్నర్, అలీ, బ్రహ్మానందం వంటి కమెడియన్స్ పై కూడా ఆయన నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే.

దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus