స్ట్రయిట్ సినిమాలకంటే రీమేక్ సేఫ్ అనుకున్నాడేమో

“చల్ మోహన్ రంగా, లై, శ్రీనివాస కళ్యాణం” చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ అనంతరం చిన్న బ్రేక్ తీసుకున్న నితిన్ “ఛలో”తో హిట్ కొట్టిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి అనుకున్నప్పటికీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అయితే.. ఇప్పుడు నితిన్ దృష్టి తమిళ సూపర్ హిట్ చిత్రం “రత్ససన్” మీద పడింది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొంది ఘన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రం తమిళనాట సరికొత్త సంచలనాలకు నాంది పలకడమే కాదు.. ఒన్నాఫ్ ది బెస్ట్ ఫిలిమ్ ఆఫ్ ది డెకేడ్ గా నిలిచింది. ఆ సినిమాను తొలుత డబ్బింగ్ చేద్దామనుకున్నప్పటికీ.. సబ్జెట్ కి ఉన్న స్పాన్ చూసి రీమేక్ అయితేనే బెటర్ అనుకున్నారు.

తొలుత ఈ రీమేక్ లో సందీప్ కిషన్ నటిస్తాడని టాక్ వచ్చినప్పటికీ. ఫైనల్ గా నితిన్ దగ్గరకి వచ్చింది ఈ ప్రొజెక్ట్. థ్రిల్లర్స్ తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన సుధీర్ వర్మ ఈ రీమేక్ కు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. నేటివిటీ పరమైన చిన్న చిన్న మార్పులు తప్ప ప్రొజెక్ట్ లో ఛేంజస్ చేయకుండా సేమ్ టు సేమ్ తీస్తే గనుక తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus