జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న తారక్ కొత్త మూవీ

  • December 2, 2016 / 10:06 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అతని తాజా చిత్రం  ‘జనతా గ్యారేజ్’ రికార్డులన్నింటికీ రిపేరు చేయడంతో పూర్వవైభవం సొంతం చేసుకున్నారు. తారక్ వేసే నెక్స్ట్  స్టెప్ పై చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మాస్ మసాలా కథ ఎంచుకుంటారా? క్లాస్ స్టోరీ వైపు వెలుతారా? మళ్లీ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తో వస్తారా ? అని అభిమానులు వెయిటింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఇప్పటికే అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ , లింగు స్వామి, ఒక్కంతు వంశీ తోపాటు యువ రచయితలు కూడా కథలు చెప్పారు. అయితే ఆయన ఎవరికీ ఒకే చెప్పలేదు. రీసెంట్ గా దర్శకుడు బాబీ తారక్ కు ఒక కథ చెప్పినట్లు తెలిసింది.

మాస్ మహారాజ్ రవితేజ తో పవర్ అనే బ్లాక్ బస్టర్ తీసిన ఈ డైరక్టర్, ఆ తర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్ తో అపజయాన్ని ఎదుర్కొన్నారు. దీంతో హిట్ కొట్టాలని కసితో మంచి కథను రెడీ చేశారు. ఆ స్టోరీ ఎన్టీఆర్ కి భలే నచ్చిందంట. అతనితో సినిమా చేసేందుకు ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. ఇది వరకు తారక్ మాట ఇచ్చినట్లుగానే అన్నతోనే కలిసి నడవనున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. సినిమా విజయం సాధించిన తర్వాత మాత్రమే లాభాల్లో వాటా అందుకుంటారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus