అభిమానులకు రెండు గిఫ్ట్ లు ఇవ్వనున్న ఎన్టీఆర్

  • May 4, 2017 / 09:30 AM IST

ఎన్టీఆర్ తన అభిమానులను ఆశ్చర్య పరచనున్నారు. తన పుట్టిన రోజు (మే 20)న  రెండు కానుకలను ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని మూడవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఈనెల ఆరవ తేదీ నుంచి గుజరాత్ లో మూడో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని మొదటి కానుకగా అందించనున్నారు.

రెండో కానుక ఏమిటంటే.. తన నెక్స్ట్ సినిమా ప్రకటన. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను చేయనున్న మూవీ గురించి అదే రోజు ప్రకటించనున్నట్లు తెలిసింది. ఎప్పటి నుంచో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది ఇన్ని రోజులకు తీరనుంది.  ఇలా ఎన్టీఆర్ తన పుట్టిన రోజున రెండు గిఫ్టులు ఇవ్వనున్నారు. సో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus