‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానున్న ఎన్టీఆర్, రాజమౌళి?

  • December 10, 2018 / 06:54 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘వినయ విధేయ రామ’. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తికానుంది. ఇక అన్ని పనులు పూర్తిచేసి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన రిలీజ్ చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ రాజమౌళి, హీరో జూనియర్ ఎన్టీఆర్ గెస్టులుగా రాబోతున్నారనే వార్త వినిపిస్తుంది.

దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న భారీ మల్టీస్టార్ సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని కూడా డి.వి.వి.దానయ్య నిర్మిస్తుండటంతో ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వీరిని గెస్టులుగా ఆహ్వానించాడని తెలుస్తుంది. ఇలా ఈ ముగ్గురు కలసి ఒకే వేదికపైన కనిపిస్తే అభిమానులకు కన్నుల పండగనే అని అంటున్నారు. అయితే దీనిపైనా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus