యాస కోసం ఎన్టీఆర్ స్పెషల్ ట్రయినింగ్

  • June 23, 2018 / 12:25 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న‌ విషయం విదితమే. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా.. తదుపరి షెడ్యూల్‌ను ఈ నెల 9 నుంచి ప్రారంభించుకోనుంది. ఇదిలా ఉంటే.. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో మాట్లాడనున్నార‌ని తెలిసింది.

ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ గత వైభవం పొందాలని భావిస్తున్న త్రివిక్రమ్.. చిత్తూరు యాసలో డైలాగ్స్‌తో పాటు ఒక పాట కోసం.. ప్రముఖ జానపద గాయకుడు పెంచల్ దాస్ సాయం తీసుకోనున్నారు. తాజాగా నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’లో “దారి చూడు” అనే పాటను రచించి, ఆలపించింది కూడా పెంచల్ దాస్ కావ‌డం గ‌మ‌నార్హం. ఆ పాటతో ప్రేక్షకులని ఎంత‌గానో ఆకట్టుకున్న ఈ గాయకుడు.. ఇప్పుడు త్రివిక్రమ్ కోసం తన కలానికి మ‌రోసారి పని చెప్పనున్నారు. కాగా.. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus