త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాకి అంతా క్లియర్

  • May 8, 2017 / 07:03 AM IST

కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్ దిట్ట. అందుకే అతని దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ కథను చేయాలనీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనుకున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా రావాలని ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. జనతా గ్యారేజ్  తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ చేస్తున్నారని టాక్ వచ్చింది. దీంతో అభిమానులు ఆనందపడేలోపు వారి కలయికలో సినిమా లేదని వార్త బయటికి వచ్చింది. ఇలా కొంతకాలంగా డైలమాలో ఉన్న ప్రాజక్ట్ పై స్పష్టమైన ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ  సినిమా చేస్తున్నారు.

ఈ మూవీ సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. దీని తర్వాత  త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలిసింది.  ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. ఆ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. అనంతరం అక్టోబర్ నుంచి త్రివిక్రమ్, ఎన్టీఆర్  కాంబినేషన్లో సినిమా తెరకెక్కడం ఖాయమని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్నఎన్టీఆర్ 28 వ సినిమా ఏప్రిల్ ల్లో థియేటర్లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు నిరాశపడనవసరం లేదు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus