ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కథలో కీలకం ఇదే

  • May 2, 2018 / 07:31 AM IST

జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయింది. నగర శివార్లలో జరిగిన తొలి షెడ్యూల్ లో రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఒక యాక్షన్ సీన్ ని చిత్రీకరించారు. దీంతో ఒక వారం రోజుల పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రేక్ ఇచ్చారు. మే మొదటి వారంలో రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మొదలుకాబోతోంది. 4 కోట్లతో నిర్మితమైన రాయ‌ల‌సీమకు చెందిన ఓ గ్రామం సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డే, యంగ్ హీరో నవీన్ చంద్రతో పాటు ప్రధాన పాత్రలందరూ పాల్గొననున్నారు.

తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఇది ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇందులో జగపతి బాబు, నాగబాబులు శత్రువులుగా కనిపించనున్నారని వెల్లడించారు. ఫ్యాక్షన్ కథలు ఎన్టీఆర్ కి బాగా కలిసి వచ్చాయి. ఆది మంచి విజయాన్ని అందించాయి. ఇప్పుడు ఈ సినిమాకూడా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోతుందని చిత్ర బృందం బలంగా నమ్ముతోంది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus