ఎన్టీఆర్ 28 డైరక్టర్ అతనేనా?

  • April 8, 2017 / 12:21 PM IST

జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే తారక్ తో సినిమా చేయాలనీ తెలుగు టాప్ డైరక్టర్లు కథలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో  జై లవ కుశ  సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకొని సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ ప్రాజక్ట్ తర్వాత తారక్ ఏ డైరక్టర్ తో సినిమా చేస్తారని ఇప్పుడే టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలయింది. పవన్ సినిమా ప్రారంభంలో ఆలస్యం కావడంతో త్రివిక్రంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లేనట్టేనని అర్ధమయిపోయింది. బాహుబలి తర్వాత ఎవరితో సినిమా చేస్తానని సంగతి ఇప్పటి వరకు రాజమౌళి చెప్పలేదు.

అతను ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారని ఫిలిం నగర్ టాక్. మరో డైరక్టర్ కూడా ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సమాచారం. అతనే వినాయక్. వీరిద్దరి కలయికలో వచ్చిన ఆది, అదుర్స్ సూపర్ హిట్ అయ్యాయి. మళ్ళీ కలిసి సినిమా చేయడానికి డైరక్టర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఖైదీ నంబర్ 150 వంటి విజయం అందుకున్న తరవాత కూడా ఖాళీగా ఉంది ఎన్టీఆర్ కోసమేనని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. మరి ఎన్టీఆర్ 28 వ మూవీని వీరిద్దరిలో ఎవరితో చేస్తారో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus