‘ఎన్టీఆర్’ ఆడియో వేడుక ప్లేస్ మళ్ళీ మారింది

  • December 19, 2018 / 09:51 AM IST

‘ఎన్.బి.కె’ ఫిలిమ్స్ మరియు ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్ల పై నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ ను క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్’ జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న మొదటి పార్ట్ ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ ఆడియో మరియు ట్రైలర్‌ను డిసెంబర్ 21న హైదరాబాద్ లో ఫిలింనగర్ సమీపంలో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్‌‌ హాల్ లో విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

అయితే ముందు ఈ వేడుకను ఎన్టీఆర్ జన్మస్థలం అయిన కృష్ణా జిల్లా నిమ్మకూరులో చేయాలని ప్లాన్ చేశారు. అయితే ‘పెథాయ్’ తుపాను కారణంగా ఈ వేడుకను హైదరాబాద్‌కు మార్చడం జరిగిందట. సంక్రాంతి కానుకగా జనవరి 9 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా… ముఖ్య పాత్రల్లో విద్యాబాలన్, రానా దగ్గుబాటి, నందమూరి కల్యాణ్ రామ్, సుమంత్ తదితరులు నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus