పాపం విక్రమ్ కొడుకు.. ఎన్ని కష్టాలొచ్చాయో..!

  • November 6, 2019 / 03:50 PM IST

తెలుగు లోనూ, హిందీ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ తమిళంలో కూడా రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. మొదట ఈ రీమేక్ ను ప్రముఖ దర్శకుడు బాలా ‘వర్మ’ పేరుతో మొదలు పెట్టాడు. చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసాడు కూడా..! అయితే ఆయన సరిగ్గా తెరకెక్కించలేదని రషెస్ చూసిన విక్రమ్ డైరెక్టర్ ను మార్చేసి చాలా వరకూ మళ్ళీ రీ షూటింగ్ చేయించాడు. అలా దర్శకుడు గిరీశయ్య వచ్చి ఈ చిత్రాన్ని ‘ఆదిత్య వర్మ’ గా మార్చి మళ్ళీ తీసాడు.

ఇక నవంబర్ 8 న విడుదల చేయడానికి కూడా రంగం సిద్ధం అయ్యింది. కానీ సెన్సార్ బోర్డు వారు మాత్రం ఈ చిత్రానికి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ చిత్రానికి వారు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారట. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలంటే ‘యు/ఎ’ సర్టిఫికెట్ కావలి. ఇందుకోసం మళ్ళీ నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయం ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఇన్ సైడ్ టాక్ మాత్రం ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూద్దాం..!

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus