మరోసారి ‘గౌతమ్ నంద’ డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా..!

  • January 11, 2019 / 01:23 PM IST

‘ఏమైంది ఈవేళ’ వంటి క్లాస్ చిత్రంతో టాలీవుడ్ పరిచయమయ్యి… ‘రచ్చ’ ‘బెంగాల్ టైగర్’ వంటి మాస్ చిత్రాలతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు సంపత్ నంది. అయితే ఆ తరువాత గోపీచంద్ తో చేసిన ‘గౌతమ్ నంద’ డిజాస్టర్ గా నిలిచింది. గోపీచంద్ డబుల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో గోపీచంద్ నటనకి మంచి మార్కులు పడినప్పటికీ.. పాత చింతకాయ కథలాగా అనిపించడం… కథనంలో కూడా వేగం లోపించడంతో ఘోర పరాజయాన్ని చవి చూసింది.

ఇక ఈ చిత్రం తరువాత సంపత్ నంది కి కూడా అవకాశాలు లేవనే చెప్పాలి. ‘గౌతమ్ నంద’ చిత్రం తరువాత సంపత్ ఏ చిత్రంలోనూ నటించలేదు. ఇక మరోవైపు గోపీచంద్ చేసిన సినిమాలు కూడా ఒక్కటంటే.. ఒక్కటి కూడా హిట్టవ్వలేదు. ప్రస్తుతం గోపీచంద్ తమిళ డైరెక్టర్ తీరు డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇక తాజాగా గోపీచంద్ ను కలిసి ఓ కథ చెప్పాడంట సంపత్ నంది. ఇక ఈ కథ నచ్చడంతో గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు తెలుస్తుంది. ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ అధినేత రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. గత సంవత్సరం ఇదే బ్యానర్లో ‘పంతం’ అనే చిత్రాన్ని చేసాడు గోపీచంద్. ఇక సంపత్ నందితో చేయబోయే చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. గతంలో ప్లాప్ ఇచ్చిన ఈ కాంబినేషన్ ఈ సారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus