Jr NTR: ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రూ.కోటి విజేత!

  • November 22, 2021 / 09:51 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో జెమినీ ఛానల్ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా హాజరు కాగా త్వరలో ఎన్టీఆర్ మహేష్ కాంబో ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షోలో తెలంగాణ పోలీస్ అధికారి రాజా రవీంద్ర 15 ప్రశ్నలకు సమాధానాలను చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. షోలో ఎన్టీఆర్ గారు హోస్ట్ సీట్ నుంచి కిందకు వచ్చారని ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆయన కిందకు వచ్చారని తాను అనుకున్నానని రాజా రవీంద్ర అన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన దగ్గరకు మీరు చిట్టీలు పెట్టుకొచ్చారా? అని అడిగారని నేను చెప్పాల్సినవి కూడా మీరే చెప్పారు అని ఎన్టీఆర్ తనతో అనడం ఫన్నీగా అనిపించిందని రాజా రవీంద్ర అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సెన్సాఫ్ హ్యూమర్ తనకు ఎంతగానో నచ్చిందని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు. మొత్తం 15 ప్రశ్నలలో 14వ ప్రశ్న తనకు చాలా కష్టంగా అనిపించిందని రాజా రవీంద్ర అన్నారు. కోటి రూపాయలు గెలవడం చాలా సంతోషంగా అనిపించిందని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ గారు కరెక్ట్ ఆన్సర్ ఫిక్స్ చేసినా టెన్షన్ పెడతారని కాన్ఫిడెంట్ గా ఉండి కరెక్ట్ ఆన్సర్ చెప్పినా హాట్ సీట్ లో కూర్చుంటే డౌట్స్ రైజ్ అవుతాయని రాజా రవీంద్ర అన్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus