ప్రొడ్యూసర్ టైటిల్ కార్డ్ కోసం పోట్లాడుతున్నారు!

  • June 13, 2018 / 04:12 AM IST

మహేష్ బాబు 25వ సినిమాని అశ్వినిదత్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనుండగా.. వచ్చే నెల నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. ప్రారంభోత్సవం కూడా జరుపుకొన్న ఈ చిత్రం కోసం మహేష్ బాబు గెడ్డం పెంచి సరికొత్త లుక్ కూడా ట్రై చేస్తుండగా.. ఇప్పుడు నిర్మాతలిద్దరి నడుమ మాటల గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

నిజానికి మహేష్ బాబు డేట్స్ ఇచ్చింది అశ్వినీదత్ కి, అది కూడా తన పరిచయ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత అనే అభిమానంతో.. అయితే నిర్మాతగా తనకు సరైన హిట్స్ లేకపోవడంతో దిల్ రాజుతో కలిసి ఆ సినిమాను నిర్మించాలనుకొన్నారు. అయితే.. “మహానటి” సినిమాతో అశ్వినీదత్ స్థాపించిన వైజయంతీ మూవీస్ కి పూర్వ వైభవం లభించడంతో ఇప్పుడు తానే మహేష్ బాబు సినిమాని నిర్మించాలనుకొంటున్నాడట. అయితే.. ఆల్రెడీ తాను నిర్మాత అని ప్రకటించుకొన్న ప్రొజెక్ట్ కు ఇప్పుడు సమర్పకుడిగా వ్యవహరించడానికి ఒప్పుకోకపోతుండడంతో.. సరికొత్త సమస్య తలెత్తింది. మరి ఈ విషయంలో క్లారిటీ రావడానికి ఎంత టైమ్ పడుతుందో.. సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఆ దేవుడికే తెలియాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus