మీలో ఎవరు కోటీశ్వరుడు … రూట్ మార్చాడా?

  • February 23, 2017 / 10:04 AM IST

మాటీవీలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షో బాగా పాపులర్ అయింది. గత మూడు సీజన్స్ లో కింగ్ అక్కినేని నాగార్జున గెస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా ప్రశ్నలు సంధిస్తున్నారు. రెండువారాల క్రితం మొదలయిన ఈ షో సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల మధ్య  వస్తోంది. ఈ ఎపిసోడ్స్ ని చిరు బాగానే నడిపిస్తున్నాడని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే  మీలో ఎవరు కోటీశ్వరుడు … రూట్ మారింది.. అని కొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఈ షో ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటివరకు పార్టిసిపెంట్స్ కంటే సెలబ్రిటీలు ఎక్కువమంది వచ్చారు. అదికూడా సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో హీరోయిన్లు వస్తుండడం ఆరోపణలకు  తావిస్తోంది.

ఓం నమో వెంకటేశాయ సినిమా ప్రచారం కోసం నాగ్, ప్రగ్య జైస్వాల్ తొలుత వచ్చారు. అలాగే రానా, తాప్సి తో కలిసి హాట్ సీట్ లో కూర్చున్నారు. ఇప్పుడు విన్నర్ ప్రచారం కోసం అన్నట్లుగా సాయి ధరమ్ తేజ  వస్తున్నారు. ఈ ఎపిసోడ్ సినిమా విడుదలయిన వారానికి మార్చి 2న ప్రసారం అవుతుంది. అలాగే సునీల్ ఉంగరాల రాంబాబు ప్రచారం కోసం ఓ ఎపిసోడ్ షూట్ చేసి ఉంచేసినట్లు టాక్. అది ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ప్రసారం అవుతుంది. ఇలా వారానికో సినిమా చొప్పున ఎంఈకే ప్రచారం చేస్తోంది. దీంతో సామాన్యుల సింహాసనం అనే హాట్ సీట్ సెలబ్రిటీల ప్రచార రధం అయిందని ఘాటుగానే విమర్శిస్తున్నారు. మరి దీనిపై ఎంఈకే బృందం ఏమని సమాధానం చెబుతుందో..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus