రామ్ చరణ్, అల్లు అర్జున్ గురించి పవిత్ర లోకేష్ ఏమన్నారంటే?

  • March 2, 2017 / 10:41 AM IST

మెగా హీరోల గురించి కన్నడ నటి పవిత్రా లోకేశ్ కొన్ని ఆసక్తికర సంగతులు వెల్లడించారు. ఈమె తెలుగు సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా నటిస్తూ అభినందనలు అందుకుంటున్నారు. మెగా హీరోలైన రామ్‌ చరణ్, అల్లు అర్జున్ లకు కూడా అమ్మగా నటించారు. ప్రస్తుతం కాటమరాయుడులో శ్రుతిహాసన్‌కు, దువ్వాడ జగన్నాథంలో అల్లుఅర్జున్‌కు తల్లిగా కనిపించనున్నారు. ఇప్పటివరకు కలిసి పనిచేసిన యువ హీరోల గురించి ఓ ఇంటర్వ్యూ లో వివరించారు. “రామ్ చరణ్ కి బద్ధకం ఎక్కువ.  నీకింకా పిల్లలొద్దా.. ఎప్పుడు కంటావు? అని అడిగినప్పుడల్లా.. ‘నేనే ఓ పిల్లాడిని. నాకెందుకు పిల్లలు.

అయినా అప్పుడే నాకు పిల్లలేంటి’ అని చెప్పేవాడని తెలిపారు. ఇక బన్నీ అయితే తనని స్వీట్ మదర్ అంటూ పిలుస్తాడని అన్నారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పవిత్రకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో శర్వానంద్ కి తల్లిగా  నటించారు. ఆ యువ హీరో గురించి అడగగా.. “శర్వానంద్ సహజ నటుడు. నటనను మరింత సానబట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు” అని చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus