పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మామూలుగా లేదు..!

  • November 2, 2020 / 10:16 PM IST

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ మొదట ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఆ చిత్రం చేస్తూనే క్రిష్ డైరెక్షన్లో కూడా ఓ సినిమా మొదలుపెట్టాడు. నిజానికి ‘వకీల్ సాబ్’ పూర్తయిన వెంటనే క్రిష్ ప్రాజెక్టునే కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ వల్ల ప్లానింగ్ మొత్తం మారిపోయింది.ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ పూర్తయిన వెంటనే మలయాళం సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో నటించడానికి పవన్ రెడీ అవుతున్నాడు.

‘అప్పట్లో ఒకడుండే వాడు’ ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. నిజానికి ఇంత సడన్ గా పవన్ ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చెయ్యడానికి గల కారణం ఏంటి? అని అంతా అనుకున్నారు. పవన్ వెంటనే ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఓకే చెప్పింది రెండు కారణాలతో అని తెలుస్తుంది. మొదటి కారణం.. ఈ చిత్రం 3నెలల్లో పూర్తయిపోతుంది. అందుకు పవన్ కళ్యాణ్ 40 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందట. మరో కారణం..

ఈ చిత్రానికి పవన్ అందుకోబోయే పారితోషికం అని తెలుస్తుంది. ఆ 40రోజులకు గాను పవన్ కు 30 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు. అది కాకుండా లాభాల్లో 20శాతం వాటా కూడా ఉండబోతుందని సమాచారం.అందుకే వెంటనే ఈ ప్రాజెక్టు చెయ్యడానికి పవన్ ఓకే చెప్పేశాడని తెలుస్తుంది. ఇక జనవరి నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని ఇన్సైడ్ టాక్.!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus