నేడు లాంఛనంగా ప్రారంభమైన ప్రభాస్ 20 వ సినిమా

  • September 6, 2018 / 08:43 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. రీసెంట్ గా అబుదాబిలో ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లో వేసిన మార్కెట్ సెట్ లో కొని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ మూవీ విశేషాలను ఈ రోజు ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “నా నెక్స్ట్ సినిమా గురించి మీకు చెబుతున్నందుకు ఆనందంగా ఉంది.

కేకే రాధాకృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాను. ఇది కూడా మూడు భాషల్లో రూపుదిద్దుకోనుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నారు. నా పక్కన పూజా హెగ్డే నటించబోతోంది. ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది” అంటూ వెల్లడించారు. దీంతో ప్రభాస్ తదుపరి సినిమా విషయంలో అభిమానులకు క్లారిటీ వచ్చింది. హైదరాబాద్ లోని కృష్ణంరాజు ఆఫీసులో కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. పలువురు సినిమా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 1970 కాలం నాటి రొమాంటిక్ ప్రేమకథతో తెరకెక్కనున్న ఈ మూవీపై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus