‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా రానున్న ప్రభాస్

  • April 11, 2018 / 01:07 PM IST

హైదరాబాద్ లో జరిగిన భరత్ అనే నేను బహిరంగ సభ కొత్త సంప్రదాయానికి తెరలేపింది. ఒక స్టార్ హీరో సినిమా వేడుకకు మరో స్టార్ హీరో హాజరవుకావడనే విధానానికి నాంది పలికింది. ఒకే వేదికపై సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లను చూసి అభిమానులు ఆనందించారు. ఈ విధానం కేవలం సినిమా పబ్లిసిటీ కి మాత్రమే ఉపయోగపడదు.. ఫ్యాన్స్ మధ్య గొడవలకు చెక్ పెడుతుంది. పరిశ్రమలో.. బయట స్నేహపూర్వక వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విధానాన్ని అల్లు అర్జున్ కొనసాగించాలనుకున్నారు. అతను ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య సినిమా చేస్తున్నారు.

ఇది షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 4న థియేటర్లోకి రానుంది. శ్రీధర్, బన్నీ వాసులు కలిసి నిర్మించిన ఈ మూవీకి ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు రావాలని బన్నీ తన మిత్రుడు ప్రభాస్ ని పిలిచారంట. అల్లు అర్జున్ ఆహ్వానాన్ని మన్నించి ఈ వేడుకకు వస్తానని మాట ఇచ్చినట్లు తెలిసింది. ప్రభాస్ ప్రస్తుతం దుబాయ్ లో కీలక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ కి ఒక రోజు బ్రేక్ ఇచ్చి అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ కి రానున్నారు. అతను తేదీ ఖరారు చేయగానే.. చిత్ర బృందం ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus