మళ్ళీ మెగాస్టార్ ను వెంటాడుతున్న ప్రభాస్.. !

  • December 21, 2018 / 11:05 AM IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహూ’ చిత్రం తో బిజీ గా ఉన్నాడు. ‘యూ.వీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.’రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ శ్రద్ధా కపూర్ హెరాయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. ప్రముఖ బాలీవుడ్ నీల్ నితిన్ ముఖేష్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడట. శంకర్ఎహసాన్ లాయ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇక ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే ప్రభాస్.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.

‘గోపి కృష్ణ మూవీస్’ ‘యూ.వీ క్రియేషన్స్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఆల్రెడీ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుందట. తాజాగా జరిగిన ఈ షెడ్యూల్లో ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరించారట. ఈ చిత్రంలో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. విషయంలోకి వెళితే ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రాన్ని కూడా 2020 సంక్రాంతికే విడుదలచేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. మొదట ‘సైరా’ చిత్రాన్ని కూడా ఆగష్టుకు ప్లాన్ చేయగా అప్పటికి షూటింగ్ పూర్తికావడం కుదరదని జనవరికి మార్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆగష్టులో రిలీజైతే ‘సాహూ’ తో ‘సైరా’ కు పోటీ తప్పదనుకుని అందరూ కంగారు పడితే, తరువాత ‘సైరా’ డేట్ మారడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మరో సారి ‘ప్రభాస్ 20’ తో మళ్ళీ ‘సైరా’ పోటీకి సిద్దమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరి హీరోల అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. మరి చివరికి ఏం జారుతుందో చూడాలి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus