‘సాహో’ లేటెస్ట్ అప్డేట్..!

  • April 29, 2019 / 01:12 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి సుజీత్ డైరెక్షన్లో చేస్తున్న ‘సాహో’ కాగా.. మరొకటి ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో చేయబోతున్న చిత్రం ఒకటి. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ఇక ‘సాహో’ చిత్రం ఆగష్టు 15 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబై లో జరుగుతుంది. గత ఎనిమిది రోజులుగా యాక్షన్ సీన్స్ కు సంబంధించిన సీన్స్ ను తెరకెక్కిస్తున్నారట. దీంతో ముంబై షెడ్యూల్ పూర్తవుతుంది. దీని తరువాత ‘సాహో’ చిత్రబృందం త్వరలో యూరప్ కు వెళ్ళనుందని సమాచారం.

అక్కడ శ్రద్ధా కపూర్ – ప్రభాస్ కు మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా మరోపక్క ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చక చకా జరిగిపోతున్నాయట. ఈ మధ్య విడుదలైన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరలయిన సంగతి తెల్సిందే. ఈ పిక్ లో శ్రద్ధా కపూర్ – ప్రభాస్ ఇద్దరూ ఒకరికళ్ళలోకి ఒకరు మంచి రొమాంటిక్ మూడ్ లో చూసుకుంటూ ఉంటారు. ఈ ఒక్క ఫోటోకే ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ‘యు.వి క్రియేషన్స్’ సంస్థ నిర్మిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus