భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సాహో!

  • May 21, 2018 / 06:55 AM IST

బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో మూవీ రెండు షెడ్యూల్స్ హైదరాబాద్ లోనే జరిగాయి. గత నెల మూడో షెడ్యూల్ దుబాయిలోని అబుదాబి లో మొదలయింది. ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్ , కొంతమంది ఫైటర్స్ పై యాక్షన్ సీక్వెన్స్  తెరకెక్కించారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ సీన్ లో హీరోయిన్ శ్రద్ధా కపూర్.. మరో నటి ఎవిలెన్ శ‌ర్మ, తమిళ నటుడు అరుణ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. లగ్జరీ కార్లు, బైకులతో ఛేజ్‌ సీక్వెన్సులు షూట్ చేశారు. ఈ సీన్స్ అద్భుతంగా వచ్చాయని సమాచారం.

అంతేకాదు ఈ షెడ్యూల్ నిన్నటితో పూర్తి అయిందని ఎవిలెన్ శ‌ర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అయితే డైరక్టర్, హీరో, నిర్మాత గానీ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించలేదు. ఎవిలెన్ శ‌ర్మ మాత్రం బై బై దుబాయ్ అని కామెంట్ చేసింది. ఆమె రోల్ పై ఉన్న సీన్స్ కంప్లీట్ అయిందా? లేకుంటే షెడ్యూల్ కంప్లీట్ అయిందా? లేదా? అనేది ఇంకా కచ్చితంగా తెలియదు.   యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ టీ సిరీస్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు  సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus