స్టార్ డైరక్టర్ కి రెండో సారీ నో చెప్పిన ప్రభాస్

  • May 18, 2018 / 07:05 AM IST

బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది. క్రేజ్ పెరిగింది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ అతనిలో మాత్రం కొంచెం కూడా మార్పు రాలేదు. నచ్చిందే చేస్తున్నారు. అభిమానులు మెచ్చేవే  చేస్తున్నారు. కోట్లు వస్తున్నాయని కక్కుర్తి పడడం లేదు. ఆ మధ్య ఓ ప్రోటీన్ షేక్ ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్  గా ఉండమంటే ఒప్పుకోలేదు. యువతకి కీడు కలిగించే ఉత్పత్తులను తాను ప్రోత్సహించనని కోట్లు వదులుకున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డైరక్టర్ కరణ్ జోహార్ డైరక్ట్ హిందీ సినిమా చేయమని కోట్లు కుమ్మరించారు. అయితే ఇది వరకే తాను ఇద్దరికీ మాట ఇచ్చానని, అవి అయిపోయిన తర్వాత చూద్దామని పక్కన పెట్టారు. ప్రస్తుతంలో వాటిలో ఒకటైన సాహోని కంప్లీట్ చేయడానికి సాహసాలు చేస్తున్నారు.

ఈ షూటింగ్ అబుదాబిలో సాగుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కుతోంది. దీని తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు. గోపికృష్ణ మూవీ బ్యానర్లో కృష్ణం రాజు నిర్మించనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. పోనీ ఆ తర్వాత అయినా తనకు డేట్స్ ఇవ్వమని కరణ్ జోహార్ మళ్ళీ ప్రభాస్ ని కోరారంట. “ఈ సినిమాలపై దర్శకులు చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. కొన్ని సీన్స్ బాగా రాకపోతే మళ్ళీ డేట్స్ కావాలని కోరుతారు. అప్పుడు నేను డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ముందుగానే నేను మీకు డేట్స్ ఇచ్చి లాక్ కాలేను” అని ప్రభాస్ స్పష్టంగా చెప్పినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇది తెలిసి ప్రభాస్ నిజాయితీని బాలీవుడ్ సినీ జనాలు అందరూ మెచ్చుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus