మంచి మనసు చాటుకున్న ప్రణీత

  • October 17, 2018 / 09:40 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, చిరంజీవి, ప్రకాష్ రాజ్ తదితరులు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ మంచి మనసును చాటుకున్నారు. హీరోయిన్స్ లోను సమంత వంటివారు చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. ఇలా పేదల బాగుకోసం పాటుపడేవారి జాబితాలో ప్రణీత చేరింది. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా తెలుగు వారికీ పరిచయమైన ఈ బ్యూటీ అత్తారింటికి దారేది సినిమాతో అందరికీ దగ్గరయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబులతో కలిసి నటించింది. ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు లేవని కన్నడలో సినిమాలు చేస్తోంది. చాలా కాలం గ్యాప్ తర్వాత త్రినాథ‌రావ్ న‌క్కిన దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న “హలో గురు ప్రేమ కోసమే” చిత్రంలో నటించింది. ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది.

ఆ మూవీ ప్రమోషన్లో చిత్ర బృందం బిజీగా ఉంటే ప్రణీత మాత్రం కనీస సౌకర్యాలు కూడా లేని ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. తన తండ్రి పుట్టి పెరిగిన ఆలూరులోని పాఠశాలను అక్కడ పరిస్థితులను చూసిన ప్రణీత, తన సొంతూరికి సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో.. ఎలాంటి సదుపాయాలు లేని అక్కడి పాఠశాలను దతత్త తీసుకుంది. ఐదు లక్షలతో కనీస సౌకర్యాలు కల్పించనుంది. ప్రధానంగా అక్కడ మరుగుదొడ్డి నిర్మించడంతో పాటుగా విద్యార్థుల తరగతి గదులకు మరమ్మత్తులు చేయించనుంది. ప్రణీత చేస్తున్న పని తెలుసుకున్న ఆమె అభిమానులు, నెటిజనులు అభినందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus