దాదాపు 10 ఏళ్ళ తరువాత… దిల్ రాజు బ్యానర్లో నాగ చైతన్య సినిమా..?

  • February 1, 2019 / 08:08 AM IST

ఈ మధ్య కాలంలో నాగ చైతన్యకు హిట్ పడలేదనే చెప్పాలి. ‘యుద్ధం శరణం’ ‘సవ్యసాచి’ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. మధ్యలో వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఈ సారి ఎలాగైనా సరే కొట్టాలనే పట్టుదలతో వున్నాడు చైతూ. ప్రస్తుతం తన భార్య సమంతతో కలిసి ‘మజిలీ’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక వెంకటేష్ తో కలిసి ‘వెంకీమామ’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు తనకి హిట్ ఇస్తాయనే నమ్మకంతో ఉన్నాడట చైతూ.

ఇక ఈ చిత్రాలతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా లైన్లో పెట్టాడట. వీటిలో ఒకటి.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయబోతున్న చిత్రం ఒకటి కాగా.., మరొకటి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్న చిత్రం. నిజానికి చైతన్యను హీరోగా లాంచ్ చేసింది కూడా దిల్ రాజే కావడం విశేషం. గతంలో దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘జోష్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. 2009 సెప్టెంబర్ 5 న ‘జోష్’ చిత్రం విడుదలయ్యింది. అయితే ఈ చిత్రం ప్లాప్ గా మిగిలింది. కథ బాగున్నప్పటికీ… డైరెక్షన్, మ్యూజిక్… ఆకట్టుకోకపోవడంతో ఈ చిత్రం పరాజయం పాలయ్యింది. దాదాపు పదేళ్ళ తరువాత దిల్ రాజు – నాగ చైతన్య కాంబినేషన్ రిపీట్ కాబోతుందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ ను లాక్ చేయడం జరిగిందట. ఈ చిత్రం ద్వారా మరో కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన వివరాలను ప్రకటించనున్నారని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus