అనసూయ ఇచ్చిన షాక్ కి పారిపోయాడట!

  • June 8, 2016 / 10:20 AM IST

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు ఒక్క హిట్ వస్తే చాలు.. అడిగినంత పారితోషికం ఇవ్వకపోతే నటించేదే లేదని మొండికేస్తుంటారు. వాళ్లతోనే సినిమా చేయాలనుకునే నిర్మాతలు మాత్రం తప్పక వాళ్ళు డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇస్తుంటారు. ఇప్పుడు అనసూయ దగ్గర అదే ఫాలో అవ్వాల్సి వస్తుందట. సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం వంటి చిత్రాలలో నటించిన అనసూయ అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. జబర్దస్త్ షో తో యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ నటిగా కూడా తన సత్తాను చాటుతుంది. ఈ మధ్య ఓ నిర్మాత సినిమా చేయడానికి అన‌సూయ‌ని వెదుక్కొంటూ వెళ్లాడ‌ట‌.

క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో ఓ సినిమా చేద్దామని క‌థ వినిపించాడ‌ట‌. స్టోరీ అన‌సూయ‌కు బాగా న‌చ్చింది. అయితే అనసూయ అడిగిన రెమ్యూనరేషన్ కు నిర్మాత షాక్ అయ్యాడట. 50 ల‌క్ష‌లు ఇస్తే.. అగ్రిమెంట్‌పై సంత‌కం చేస్తానని చెప్పిందట అనసూయ. కుర్రహీరోయిన్లకే ఇంత రెమ్యూనరేషన్ లేదని ప్రశ్నించిన నిర్మాతకు అమ్మడు పెద్ద క్లాస్ తీసుకుందట. నేనొక ప్రోగ్రామ్ చేసుకుంటే లక్ష రూపాయలు వస్తాయని.. అలా మీ సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటానో తెలుసా?! అంటూ గడుసుగా సమాధానం చెప్పిందని సమాచారం. దీంతో అనసూయ ఇచ్చిన షాక్ కి నిర్మాత అక్కడ నుండి పారిపోయాడని ఫిల్మ్ నగర్ కబురు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus