యూరప్ కి పయనమైన పవన్, త్రివిక్రమ్ మూవీ టీమ్!

  • October 26, 2017 / 02:06 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడవ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో పవన్, హీరోయిన్లు అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ లపై సాగింది. ఆ తర్వాత  అమీర్ పేట్ లోని సారధి స్టూడియోలో పవన్, వెంకటేష్ లపై సరదా సన్నివేశాన్ని తెరకెక్కించారు.  ఆ తర్వాత శంషాబాద్ దగ్గర ఓ పెద్ద భవనంలో షూటింగ్  చేశారు. కొన్ని రోజులపాటు త్రివిక్రమ్ ఈ చిత్ర షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ తో మూవీని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం విశేషం. ఇక త్రివిక్రమ్ ప్రస్తుత సినిమాపై దృష్టి పెట్టారు. పాటల చిత్రీకరణ  కోసం యూరప్ పయనమయ్యారు. అక్కడ అందమైన లొకేషన్లో పవన్ అను, సాయి పల్లవిలపై రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు ఉంటుందని తెలిసింది.  హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో అలనాటి హీరోయిన్స్  కుష్బూ, ఇంద్రజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus