మొత్తానికి పూజిత క్లారిటీ ఇచ్చేసింది..!

  • June 6, 2019 / 01:04 PM IST

‘దర్శకుడు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది పూజిత పొన్నాడ. ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో ఈమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ తరువాత వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంతో మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కి జోడిగా నటించింది ఈ భామ. ఆ తరువాత ‘బ్రాండ్ బాబు’ ‘వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి’ వంటి చిత్రాల్లో నటించింది. త్వరలో రాబోతున్న ‘7’ చిత్రంలో కూడా నటించింది ఈ భామ. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది.

ఈ భామకు.. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో పెళ్ళైందని, ఈమెకు కొడుకు కూడా ఉన్నాడని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాల పై పూజిత మాట్లాడుతూ .. “నాకు పెళ్లైనట్టు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. నాకు ఏడేళ్ళ కొడుకు ఉన్నట్టు వస్తున్న వార్తలు అస్సలు నిజం కాదు. నాకు… మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌తో పెళ్ళైనట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నారో అస్సలు అర్థం కావడం లేదు. నేను ఆయన్ని ‘రంగస్థలం’ 100 రోజుల ఫంక్షన్లో మాట్లాడాను అంతే. అప్పటివరకూ ఆయనతో పరిచయం కూడా లేదు. రూమర్స్ కి తల, తోక ఉండవు అని అర్థమైంది. నాకు ఇంకా పెళ్ళి కాలేదు. నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ప్రస్తుతం ‘7’ చిత్రం తర్వాత రాజశేఖర్ ‘కల్కి’ చిత్రంలో ఓ మంచి పాత్రను చేస్తున్నాను. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే కీర్తీ సురేష్ సినిమాలో కూడా నటిస్తున్నాను. అంతేకాదు మరో తమిళ సినిమాకు ఓకే చెప్పాను” అంటూ చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus