మెహబూబా నష్టాల నుంచి బయటపడేందుకే బాలయ్యతో సినిమా

  • May 24, 2018 / 01:58 PM IST

చూస్తుంటే బాలయ్యబాబు అందరికీ ఆపన్న హస్తంలా మారాడనిపిస్తుంది. తనతో “జైసింహా” అనే చిత్రాన్ని నిర్మించిన సి.కళ్యాణ్ “ఇంటిలిజెంట్” సినిమా పుణ్యమా అని భారీ మొత్తంలో నష్టపోవడంతో ఆయన నిర్మాణంలో మరో సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో తనకు హిట్ ఇవ్వకపోయినా “పైసా వసూల్”తో తనను సరికొత్తగా చూపించిన పూరీ జగన్నాధ్ ఇటీవల తన కొడుకును హీరోగా పెట్టి తీసిన “మెహబూబా“తో భారీ స్థాయిలో నష్టపోవడంతో.. అతడ్ని ఫ్లాపుల బారి నుంచి కాపాడడానికి నడుం కట్టాడు. అందుకే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడట బాలయ్య.

సో, బాలయ్యతో “పైసా వసూల్” అనే సినిమా తెరకెక్కించిన పూరీ జగన్నాధ్ ఆ సినిమాలో బాలయ్యను సరికొత్తగా మాత్రమే కాదు సినిమా ఫ్లాపైంది అనే బాధ కంటే బాలయ్యను మాంచి ఎనర్జిటిక్ గా చూశామన్నా ఆనందాన్ని ఆయన అభిమానులకు అందించాడు పూరీ జగన్నాధ్. పూరీ సినిమాలని అత్యంత వేగంగా, పక్కా మాస్ కంటెంట్ తో చిత్రాన్ని తెరకెక్కించే విధానం నచ్చే బాలయ్య మరో అవకాశం ఇవ్వడానికి ఒప్పుకొన్నాడట. మరి ఈ రెండో అవకాశాన్నైనా పూరీ జగన్నాధ్ సరిగ్గా వినియోగించుకోగలుగుతాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus