“రంగస్థలం 1985” కి కితాబు ఇచ్చిన రాజమౌళి, చిరంజీవి!

  • November 16, 2017 / 08:15 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇతరుల సినిమాలు రిలీజ్ అయిన తర్వాత చూసి తన అభిప్రాయాన్ని షేర్ చేస్తుంటారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న “రంగస్థలం 1985 ” చిత్రం గురించి ముందుగానే స్పందించారు. నెల రోజుల క్రితం చిరంజీవితో కలిసి సెట్స్ కి వెళ్లి పరిశీలించిన రాజమౌళి.. తాజాగా కొంత భాగం సినిమాని చూశారంట. చూసిన వెంటనే జక్కన్న సుకుమార్, రామ్ చరణ్ టీమ్ ని అభినందించనట్లు సమాచారం. అంతేకాదు ఇది ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ గా ఉండబోతుందని చెప్పినట్లు తెలిసింది.

అలాగే చిరంజీవి కూడా రంగస్థలం చిత్ర బృందాన్ని ప్రశంసించినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్ ని ఈ మూవీ మరో అడుగు ముందుకు తీసుకెళుతుందని చెప్పారంట. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం 80  శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కొన్ని సీన్లు నాలుగు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ అయ్యే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus