త్రివిక్రమ్, తారక్ పై ప్రసంశలు గుప్పించిన రాజమౌళి!

  • October 12, 2018 / 02:55 PM IST

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో రూపుదిద్దుకున్న “అరవింద సమేత వీర రాఘవ” మూవీ నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయి కలక్షన్ల సునామీ సృష్టించింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీ  తొలిరోజే 60 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ… ఎన్టీఆర్ నటనని, త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ రోజు ఈ సినిమాని చూసిన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికపై పంచుకున్నారు. “రాయల సీమలోని గొడవల నేపథ్యాన్ని తీసుకొని త్రివిక్రమ్ గారు దైర్యంగా అడుగువేశారు.

అలాగే ఆ కథని అద్భుతంగా చూపించడంలో విజయం సాధించారు. తారక్ నటన ప్రతి సన్నివేశాన్ని ఎక్కువకాలం గుర్తుండిపోయేలా చేసింది. జగపతిబాబు గారు ఆశ్చర్యకరమైన నటనని ప్రదర్శించారు” అంటూ అరవింద చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. జక్కన్న ట్వీట్  చిత్ర బృందానికి సంతోషాన్ని కలిగించాయి. ఫ్యాక్షన్ కథని ఒక క్లాసిక్ చిత్రంలా మలిచి త్రివిక్రమ్ ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు అందుకుంటున్నారు. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus