Rajendra Prasad: కూతురు గాయత్రిపై రాజేంద్రప్రసాద్ చేసిన ఎమోషనల్ కామెంట్స్.. వీడియో వైరల్!

  • October 5, 2024 / 06:08 PM IST

ఈరోజు నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఒక్కగానొక్క కూతురు గాయత్రి ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి ఆమెకు ఛాతి నొప్పి వచ్చిందట, పొరపాటున అది గ్యాస్ నొప్పి అనుకుని ఏ ఐ జి హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేశారు. ఈ క్రమంలో ఆమెకు వచ్చింది గ్యాస్ నొప్పి కాదు, కార్డియాక్ అరెస్ట్ అని డాక్టర్లకి తెలిసింది. ఆ తర్వాత చికిత్స పొందుతున్న సమయంలో ఆమె మరణించడం జరిగింది.

Rajendra Prasad

దీంతో రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. టాలీవుడ్ కి చెందిన స్టార్లు అంతా రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి.. అతన్ని పరామర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి వయసు కేవలం 38 ఏళ్లే కావడం విషాదకరం. ఇదిలా ఉండగా.. గతంలో రాజేంద్రప్రసాద్ ‘బేవర్స్’ అనే సినిమా ప్రమోషన్స్ లో ఓ ‘తల్లి తల్లి’ అనే పాట గురించి స్పందిస్తూ.. తన కూతురు గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

‘తల్లిని పోగొట్టుకున్న ప్రతీవాడూ…కుతూర్లో తల్లిని చూసుకుంటారు. నాకు ఒక కూతురు ఉంది. అదంటే నాకు కోపం. ఎందుకంటే.. లవ్ మ్యారేజ్ చేసుకుంది. 8 ఏళ్ళ వరకు నా కూతురితో నేను మాట్లాడలేదు.ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ కామనే..! అయితే ఈ తల్లి తల్లి అనే పాట వినడానికి.. దానికి(కూతురికి) ఫోన్ చేసి పిలిచాను. నా కూతురి ఎదురుగా ఈ పాటని 4,5 సార్లు విన్నాను’ అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. అతని కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

వరుణ్ తేజ్ ‘మట్కా’ టీజర్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus