రజినీకాంత్ 2.0 సినిమాపై ఫిర్యాదు చేసిన టెలికం ఆపరేటర్లు

  • November 28, 2018 / 11:23 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘2.0’. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి ఆదరణ లభించగా సినిమాపైనే అంచనాలు అందరిలో భారీగానే ఉన్నాయి. అయితే సినిమా ట్రైలర్ లో అక్షయ్ కుమార్, సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కడు హంతకుడే, సెల్ ఫోన్ ని చూడగానే ప్రతి ఒక్కరు ప్రాణభయంతో ఎలా చెల్లాచెదురవుతారో చూడు అంటూ చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి. ఇలా సినిమాలో మొబైల్ ఫోన్ల ఉపయోగం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సినిమా విడుదల అడ్డుకోవాలంటూ సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆందోళనకు దిగింది.

అయితే మొబైల్ ఫోన్ వాడితే ప్రమాదం అంటూ సినిమాలో చూపించారని, మొబైల్ ఫోన్ వాడకం వలన హాని కలుగుతుందని ఇప్పటివరకు శాస్రియంగా రుజువు కాలేదని,సైన్స్ పైన ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని వీరు దెబ్బతీస్తున్నారని, ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ కూడా వెనక్కు తీసుకోవాలని, సీబీఎఫ్‌సీకి, కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చే వరకు సినిమా విడుదలని అడ్డుకోవాలంటూ సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు చేసారని సమాచారం. మరి ఈ వివాదం గురించి పక్కన పెడితే ఈ సినిమా మాత్రం నవంబర్ 29 న  తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus