2 .o టీజర్ రిలీజ్ వేడుకకు హాజరుకానున్న నలుగురు సీనియర్ హీరోలు

  • January 29, 2018 / 08:10 AM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమర్షియల్ డైరక్టర్ శంకర్ కలయికలో రూపుదిద్దుకుంటున్న మరో కళాఖండం 2 .o. సంచలనం సృష్టించిన ‘రోబో’ సినిమాకి ఇది సీక్వెల్ . బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 500 కోట్ల భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్నఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ముంబయిలో, ఆడియోను అబుదబిలో విడుదల చేశారు. ఇప్పుడు టీజర్ ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ఫిక్స్ అయ్యారు.

ఫిబ్రవరి మూడో వారంలో జరగనున్న కార్యక్రమానికి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల సీనియర్ హీరోలు హాజరుకానున్నట్టు తెలిసింది. చిరంజీవి, మోహన్‌లాల్‌, మమ్ముట్టి తో పాటు బాలీవుడ్ హీరో కూడా ఫంక్షన్లో పాల్గొని ఆయా భాషల్లో 2 .o టీజర్లకు ఆవిష్కరించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. “ఐ” బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం దక్షిణాది సినిమా పరిశ్రమలు ఎదురుచూస్తున్నాయంటే అతిశయోక్తికాదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus