సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

ఊహించని విధంగా “మీటూ” ఉద్యమం ఎగిసిపడుతోంది. సమంత వంటి స్టార్ హీరోయిన్స్ ఈ ఉద్యమానికి మద్దతు తెలపడంతో.. దీనిపై స్పందించడానికి ఎక్కువమంది ముందుకు వస్తున్నారు. తాజాగా ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ “మీటూ”పై సంచలన కామెంట్స్ చేసింది. “లైంగిక పరమైన వేధింపులు.. మహిళలతో తప్పుగా ప్రవర్తించడం వంటివి సరికాదు. అయితే, పబ్లిసిటీ కోసం మాత్రం ‘మీటూ’ని వాడుకోవద్దు.” అని కోరింది. “మీటూ” ఉద్యమం భారత్‌లో రావడం సంతోషం. లైంగిక వేధింపుల విషయంలో నేను అదృష్టవంతురాలిని. నేనెప్పుడూ ఇలాంటి వేధింపులకు గురికాలేదు” అని తెలిపింది.

స్పైడర్ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ప్రస్తుతం హిట్స్ కరువయ్యాయి. అందుకే తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. నాగచైతన్యతో కలిసి నటించే ఛాన్స్ అందుకుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇదివరకు వీరిద్దరూ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేశారు. ఇందులో వీరిద్దరి జోడీ బాగా నచ్చింది. అందుకే దర్శక నిర్మాతలు ఈ జోడీని మళ్ళీ వెండితెరపై చూపించాలని అనుకుంటున్నారు. అన్ని కుదిరితే రకుల్ తెలుగులో రీ ఎంట్రీ త్వరలోనే ఉండబోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus