మే నుంచి అంతా రకుల్ మయమే

  • April 9, 2019 / 06:15 PM IST

గత రెండేళ్లుగా ఒక్క హిట్ కూడా లేక రకుల్ ప్రీత్ సింగ్ ఢీలాపడిన విషయం తెలిసిందే. “స్పైడర్” అనంతరం రకుల్ ఒక్కటంటే ఒక్క స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా చేయకపోవడం బాలీవుడ్ లో, కోలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ఆమె కెరీర్ అయిపోయింది అనుకొన్నారందరూ. కానీ.. నాగార్జున సరసన “మన్మధుడు 2” సినిమా సైన్ చేసే అవకాశం దక్కించుకొని “ఐయామ్ బ్యాక్” అని చెప్పకనే చెప్పింది. ఇకపోతే.. ఈ మేలో రకుల్ ఏకంగా రెండు సినిమాలతో తన అభిమానులను ఎంటర్ టైన్ చేయనుంది.

అజయ్ దేవగన్ తో కలిసి నటించిన “దే దే ప్యార్ దే” మే 17న విడుదలవుతుండగా.. ఆదే నెల చివర్లో ఆమె నటించిన తమిళ చిత్రం “ఎన్.జి.కె” విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ రకుల్ కు పోటీగా వేరే హీరోయిన్లు కూడా ఉన్నప్పటికీ.. ప్రధాన పాత్ర మాత్రం రకుల్ దే కావడంతో.. ఈ రెండు సినిమాలు గనుక హిట్ అయితే మళ్ళీ రకుల్ బ్యాక్ టు ట్రాక్ అనుకోవచ్చు. మరి ఈ రెండు సినిమాల రిజల్ట్స్ ఏమవుతాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus