రామ్ చరణ్ తో మూడోసారి జతకట్టనున్న రకుల్ ప్రీత్ సింగ్

  • June 24, 2018 / 03:11 AM IST

కమర్షియల్ సినిమా అంటే స్పెషల్ సాంగ్ అనేది కామన్. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ తో ప్రత్యేక పాట చిత్రీకరించడం అలవాటు అయిపోయింది. రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే జిగేల్ రాణిగా అదరగొట్టింది. మాస్ అభిమానులను థియేటర్ కి మళ్ళీ మళ్ళీ రప్పించడంలో విజయవంతమైంది. అందుకే ఆ కేటగిరీ ఆడియన్స్ ని నిరాశపరచకూడదని చెర్రీ భావిస్తున్నారు. అందుకే ఈసారి కూడా స్టార్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చే పనిలో ఉన్నారు. రీసెంట్ గా స్పెషల్ సాంగ్ కంప్లీట్ చేసారని సమాచారం. సూపర్ గా వచ్చిన ఆ పాటలో ఎవరిని తీసుందామని చిత్ర యూనిట్ ఆలోచించగా.. ఎక్కువమంది ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి ఓటేశారంట. తమిళ హిందీ సినిమాల కోసం ఈ భామ చాలా స్లిమ్ అయింది. కొత్త లుక్ లో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయిస్తే సినిమాకి ప్లస్ అవుతుందని బోయపాటి టీమ్ డిసైడ్ అయ్యారు. త్వరలోనే ఈ పాటని చిత్రీకరించనున్నారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus